కామారెడ్డి, ఫిబ్రవరి 26: వార్డుల్లో సమస్యలను పరిష్కరిస్తూ.. పట్టణ ప్రజల మన్ననలు పొందాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ కౌన్సిలర్లకు సూచించారు. కామారెడ్డిలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కౌన్సిలర్లను ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్తో కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవలో ముందుండాలని సూచించారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి స్వామితోపాటు కౌన్సిలర్లు గరిగంటి లక్ష్మీనారాయణ, గరిగంటి స్వప్న, అర్కల ప్రభాకర్ యాదవ్, పిట్ల వేణుగోపాల్, హఫీజ్, మామిండ్ల లక్ష్మణ్, పరిన్ కత్తర్, శ్రీనివాస్, బాలమణి, ఎజాజ్కు శాలువాలు కప్పి సత్కరించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపీగౌడ్, మాజీ వైస్ చైర్మన్ కుంబాల రవియాదవ్, పార్టీ అధికార ప్రతినిధి బలవంతరావు పాల్గొన్నారు.