బాన్సువాడ, అక్టోబర్ 11 : తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. మునుగోడు ఉన ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్ మండలంలోని మందగూడెం గ్రామంలో డీసీసీబీ చైర్మన్ బాన్సువాడ నియోజకవర్గ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలతో ప్రతి ఇంట్లో ఒక్కరైనా లబ్ధి పొందారని అన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఆయన వెంట రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, వైస్ చైర్మన్ రాజు, మహ్మద్ ఏజాస్, మాజీ జడ్పీటీసీ గోపాల్రెడ్డి, ఆయా మండలాల నాయకులు ఉన్నారు.
ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో జోరుగా ప్రచారం
బీబీపేట్, అక్టోబర్ 11 : మునుగోడులోని గట్టుప్పల్ మండలంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
ప్రభుత్వ విప్తో కలిసి జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మండలాధ్యక్షుడు వెంకట్గౌడ్, రైతుబంధు సమితి కన్వీనర్ నాగరాజ్గౌడ్ తదితరులు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్నారు. కారు గుర్తుకు ఓటేసీ టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.