నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 11: రాష్ట్ర ప్రభు త్వం నీటివనరులు వృథా పోకుండా వాగులపై చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. హైదరాబాద్లో నీటిపారుదల శాఖ సీఈ మధుసూదన్రావు, జిల్లా ఎస్ఈ బద్రీనారాయణ, ఈఈ అశోక్కుమార్తో పాటు రూరల్ సెగ్మెంట్లోని డీఈలు, ఏఈలతో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఏడు మండలా ల్లో ఉన్న చెరువులు, కుంటలు, ఇంతకు ముందు నిర్మించిన చెక్డ్యామ్ల ప్రస్తుత స్థితిగతులపై ఆయ న పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెం డేండ్ల క్రితం రూ.51 కోట్ల నిధులను మంజూరు చేయించి పది చెక్డ్యామ్లను వివిధ గ్రామాల్లో నిర్మించుకున్నామన్నారు. ఇటీవల నల్లవెల్లి, గౌరా రం, కెకె తండా, రాంపూర్, లింగాపూర్ గ్రామాల్లో ఉన్న వాగులపై చెక్డ్యాముల నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామన్నారు. గూపన్పల్లి,చిన్నతాడెం, పెద్దవాల్గోట్, తూంపల్లి, గడ్కోల్, తాళ్లరామడ్గు శివార్లలో ఉన్న వాగులపై చెక్డ్యాముల నిర్మాణా నికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని బాజిరెడ్డి అధికారులను ఆదేశించారు.
4 గ్రామాలకు కాళేశ్వరం సాగునీరు
మంచిప్ప వద్ద 3.5 టీ ఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ ద్వారా కాళేశ్వరం నీటిని రూరల్ ని యోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అం దించడానికి రిజర్వాయర్తో పాటు పైపులైన్ వేసే పనులు చురుకుగా సాగతున్నాయని అధికారులు బాజిరెడ్డికి వివరించారు. ఈ నేపథ్యంలో చీమన్పల్లి, తాటిపల్లి, పందిమడుగు గ్రామాలతో పాటు మరొక తండా శివార్లలో ఉన్న వ్యవసాయ భూ ములకు ప్యాకేజీ 9 ద్వారా పనులు చేపట్టి కాళేశ్వ రం ప్రాజెక్టు నీటిని సరఫరా చేపడతామన్నారు. అందుకు గాను అవసరమైన పైపులైన్ నిర్మాణ ప నులు చేపట్టేందుకు రూ.106 కోట్ల నిధులు మం జూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించామని బాజిరెడ్డి తెలిపారు. సమావేశంలో డీఈలు బాల్రాజ్, గంగాధర్, ప్రేమ్కుమార్, ఏఈలు శ్రీనివాస్, శ్రీచంద్, సాయినాథ్, సిద్ధార్థ పాల్గొన్నారు.