విద్యానగర్, సెప్టెంబర్ 20 : శుభ్రపరిచిన ధాన్యాన్ని మాత్రమే కొనుగో లు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చే లా సహకార సంఘాల చైర్మన్లు చూడాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వానకాలం లో ధాన్యం కొనుగోళ్లపై సహకార సంఘం అధ్యక్షులతో మం గళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడి క్లీనర్లను ఉపయోగించాలని సూచించారు. టార్పలిన్ కవర్లను, గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలన్నారు. వరి కోత మిషన్లు ఉన్న వారి వివరాలు గ్రామాల వారీగా సేకరించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వారీగా లారీలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామ ని చెప్పారు. జిల్లాలో 6000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వే బ్రిడ్జిలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. తమకు రావాల్సిన కమీషను ఇప్పించాలని సహకార సం ఘాల చైర్మన్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలి పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చం ద్రమోహన్, ఆర్టీవో వాణి, జిల్లా సివిల్ సప్లయి మేనేజర్ జితేంద్రప్రసాద్, ఇన్చార్జి సివిల్ సప్లయీస్ అధికారి రాజశేఖ ర్, జిల్లా సహకార అధికారిణి వసంత, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, సహకార సంఘాల చైర్మన్లు నల్లవెల్లి అశోక్, మర్రి సదాశివరెడ్డి, సాయికుమార్, కిష్టాగౌడ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
నిర్దేశించిన పద్ధతి ప్రకారమే పంట కోత ప్రయోగం ఎంపిక చేయాలి
నిర్దేశించిన పద్ధతి ప్రకారమే పంట కోత ప్రయోగం ఎంపిక చేసి, వచ్చిన దిగుబడిని కచ్చితంగా తూకం వేసి డాటా ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో పంట కొత్త ప్రయో గం పద్ధతి గురించి మంగళవారం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఏఈవోలు పర్యటించి రైతులు వేసిన పంట ల వివరాలు సమగ్రంగా నమోదు చేయాలన్నారు. ప్రాథమిక స్థాయిలో ఏఈవోలు, ఎంపీఎస్వోలు పంట కొత్త ప్రయోగం కోసం ఎంపిక చేసిన పొలంలో పంట దిగుబడిని కచ్చితంగా నిర్ణయించి దిగుబడి వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఉపగణాంక అధికారులు, లక్ష్మణ్ శిక్షణను ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రాజారాం, జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవన అధికారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.