కామారెడ్డి, జనవరి 28: తాను పదవిలో లేకపోయినా ప్రజల్లోనే ఉంటానని, ప్రజలకు సేవలందిస్తానని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి శివారు పాత రాజంపేట రైల్వేగేట్ పక్కన నిరుపేద దివ్యాంగుడు షేక్ ఖాదర్ ఇంటిని గంప గోవర్ధన్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం షేక్ ఖాదర్కు తన సొంత డబ్బు రూ.9లక్షలతో ఇంటిని నిర్మించి ఇచ్చానన్నారు. ప్రజా సేవలోనే సంతృప్తి ఉంటుందన్నారు.
అనంతరం ఇల్లు కట్టించి ఇవ్వడంపై హర్షం వ్యక్తంచేస్తూ షేక్ ఖాదర్తోపాటు కుటుంబసభ్యులు గంప గోవర్ధన్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, కౌన్సిలర్ ఆకుల రూపారవికుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పిప్పిరి వెంకటి, ఉపాధ్యక్షుడు కుంబాల రవి, డైరెక్టర్ రాజు, కౌన్సిలర్లు, గోపీగౌడ్, గైని శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ రామాగౌడ్, సర్పంచులు జ్ఞానేశ్వర్,రవితేజా గౌడ్, రవి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.