పెట్టుబడిదారులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలని కోరుకుంటారు. కానీ వారి డబ్బుకి భద్రత ఉంటుందా లేదా అని గమనించరు. దీంతో చాలాసార్లు నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కానీ పోస్టాఫీసు స్కీములలో పెట్టిన పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. సామాన్య చిన్న తరగతి ప్రజలకు పోస్టాఫీసు పథకాలు అనువుగా ఉంటాయి. ఇతర సంస్థలు, బ్యాంకులు అందించలేనివిధంగా పోస్టాఫీసు ద్వారా అధిక వడ్డీ, ఆదాయం అందించబడుతున్న పొదుపు పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. తపాలా శాఖ అందిస్తున్న పొదుపు పథకాలపై ప్రత్యేక కథనం..
– ఇందల్వాయి, ఫిబ్రవరి 26
గ్రామీణ ప్రాంత ప్రజలు తమ రోజువారీ కూలీ డబ్బులు, ఇతర సంపాదనను వారి స్వగ్రామంలో ఉన్న పోస్టాఫీస్లో భద్రపరుచుకునే సౌలభ్యం కలదు. దీనికి మిగతా బ్యాంకుల కన్నా అత్యధిక వడ్డీ రేటు 4శాతం ఇస్తుంది. ఉచిత ఏటీఎం, చెక్బుక్, మొబైల్ బ్యాంకింగ్, ఉచిత ఎస్ఎంఎస్ సర్వీస్ ఉంటుంది. ఈ ఖాతా ద్వారా దేశంలోని ఏ బ్యాంక్ అకౌంట్కు అయినా డబ్బులు పంపించవచ్చు. ఏ బ్యాంకు అకౌంట్ నుంచి అయినా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఆధార్ నెంబర్ అనుసంధానం చేసుకుంటే డీబీటీ ద్వారా (గ్యాస్ సబ్సిడీ, ఉపాధి హామీ, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా) వచ్చే డబ్బులు కూడా ఈ ఖాతాలో జమవుతాయి. అన్నింటికీ మించి ఖాతాదారుని సొమ్ముకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ భద్రత ఉంటుంది.
ఈ ఖాతాలో కనీసం రూ.100 నుంచి రూ.10లలో ఎంతైనా నెలనెలా జమచేయాలి. ఈ ఖాతా కాలం 5 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలు పెంచుకోవచ్చు. ప్రస్తుతం నెలకు రూ.1000 జమ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత రూ.69,697లు వడ్డీతో కలిపి పొందవచ్చు.
ఈ ఖాతాలో కనీసం రూ.1000 నుంచి ఎంతైనా జమ చేయవచ్చు. ఈ ఖాతా కాల పరిమితి 1,2,3, 5 సంవత్సరాలు ఉంటుంది. వడ్డీ ప్రతి సంవత్సరం చెల్లించబడుతుంది. పెద్ద మొత్తంలో సొమ్మును జమ చేయడానికి ఎక్కువ వడ్డీ అందిస్తుంది. ఒక్క సంవత్సరానికి 6.6, రెండు సంవత్సరాలకు 6.8, మూడు సంవత్సరాలకు 6.9, ఐదు సంవత్సరాలకు 7.0, చొప్పున వడ్డీ అందించడం జరుగుతుంది.
10 సంవత్సరాల్లోపు వయస్సుగల అమ్మాయి పేరున సుకన్య సమృద్ధి ఖాతాను ఏ పోస్టాఫీసులోనైనా తెరవచ్చు. ఒక ఖాతాను కనీసపు సొమ్ము రూ.250తో ప్రారంభించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.లక్షా 50వేలకు మించొద్దు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 జమ చేయాలి. ప్రస్తుతం 7.6శాతం చక్రవడ్డీగా నిర్ణయించారు. ఖాతాతెరచిన తేదీ నుంచి 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు జమచేయాలి. ప్రతి మూడు నెలలకు వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. ఖాతా తెరచిన తేదీ నుంచి 21 సంవత్సరాల తర్వాత ఖాతా నిలిపివేయబడుతుంది. అప్పటి వరకు జమ చేయబడిన సొమ్ము, చక్రవడ్డీని కలిపి ఫలితాన్ని అమ్మాయికి నేరుగా అందజేస్తారు. అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆమె వివాహం లేదా చదువు కోసం అంతకుముందు సంవత్సరం వరకు జమ అయిన మొత్తం సొమ్ములో 50 శాతం సొమ్మను తీసుకోవచ్చు. సెక్షన్ 80 ప్రకారం ఖాతాలో జమచేసే మొత్తం సొమ్ముపై పన్ను మినహాయింపు ఉంటుంది.
తపాలా శాఖలో అందుబాటులో ఉన్న వివిధ ఖాతాల్లో ప్రజలను చేర్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పోస్టల్ ఖాతాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 18002666868 లేదా దగ్గరలోని ఏదైనా పోస్టాఫీస్లో సంప్రదించాలి.
– సంతోష్కుమార్,
నిజామాబాద్ సౌత్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్