కామారెడ్డి/ ఖలీల్వాడి, ఫిబ్రవరి 29: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం
ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాల్లో జనరల్ విద్యార్థులు 7190 మంది హాజరు
కాగా, 185 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1012 మంది హాజరుకాగా, 25 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ నోడల్
అధికారి షేక్ సలాం తెలిపారు.
ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తనిఖీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 16,238 మంది హాజరుకాగా, 723 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో రఘురాజ్ తెలిపారు. పట్టణంలోని నిర్మల హృదయ, సీఎస్ఐ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లను అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, మాక్లూర్ ప్రభుత్వ, దాస్నగర్లోని జ్యోతిబా ఫూలే, జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు.