ఆర్మూర్: ఆర్మూర్ మండల పరిధిలోని పిప్రి గ్రామంలో ఆదివారం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ అసపురం దేవీరెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పిప్రి వాసులందరూ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలో పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులను తీసుకోవాలన్నారు.
శిబిరంలో దేగాం వైద్యాధికారి భాస్కర్రావు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి ఉచితంగా మందులను అందజేశారు. కార్యక్రమంలో పిప్రి ఉపసర్పంచ్ అసపురం శ్రీనివాస్రెడ్డి, సొసైటీ చైర్మన్ సోమ హేమంత్రెడ్డి, ఎంపీటీసీ సామెర సురేశ్, ఆరోగ్య కార్యకర్తలు, ఆవ వర్కర్లు, స్థానికులు పాల్గొన్నారు.