నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 12 : జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజనదినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ ఖ్యాతిని, సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పారని వక్తలు పేర్కొన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు వివేకానందుడి గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు.
జిల్లాకేంద్రంలోని గాజుల్పేట్లో వివేకానంద విగ్రహాన్ని అర్బన్ ఎమ్మెల్యే గణేశ్గుప్తా ఆవిష్కరించారు. ఎమ్మెల్యేను ఐటీఐ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. తెలంగాణ యూనివర్సిటీలో వీసీ రవీందర్ గుప్తా వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధర్పల్లిలోని లిటిల్ హార్ట్స్ పాఠశాలలో వివేకానంద జయంతి, సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ‘యువత’ స్ఫూర్తి నాటిక ఆకట్టుకున్నది. తెలంగాణలో ఏబీవీపీ టీయూ శాఖ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి నిర్వహించారు. పొతంగల్ మండలం చేతన్నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో వివేకానంద జయంతి నిర్వహించారు. పొతంగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ధర్పల్లి మండలకేంద్రంలోని పాఠశాలలో ఉన్న వివేకానంద విగ్రహానికి ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రుద్రూర్లో పతంజలి యోగా సమితి ఆద్వర్యంలో, చందూర్, మోస్రా మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వివేకానంద జయంతి నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని ధర్మారం(ఎం)లో ఎంపీటీసీ శైలజా రవీందర్ గౌడ్ వివేకానంద జయంతిలో పాల్గొన్నారు. సిరికొండ మండలం చీమన్పల్లిలోయువచైతన్య యూత్, పెద్దవాల్గోట్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో, సత్యశోధక్ పాఠశాలలో వివేకానంద జయంతిని నిర్వహించారు. నగరంలోని రెడ్క్రాస్ సొసైటీలో వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించగా.. గోవూర్ సర్పంచ్ నరేందర్రెడ్డి, గ్రామ యువకులు రక్తదానం చేశారు.
నిజామాబాద్ పట్టణంలోని న్యాయస్థానంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని నిర్వహించారు.
బాల్కొండలోని నవ యువసేన సమితి ఆధ్వర్యంలో వివేకానంద జయంతి నిర్వహించారు.
ఎడపల్లి మండల కేంద్రంలో వివేకానంద చిత్రపటానికి బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఎస్ఎంసీ చైర్మన్ వీఆర్ దేశాయ్, జడ్పీ వైస్ చైర్ పర్సన్ రజితా యాదవ్, ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నివాళులర్పించారు.
భీమ్గల్ మండలం ముచ్కుర్లో వివేకానంద విగ్రహనికి జడ్పీటీసీ రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సయ్య పూలమాల వేశారు. చేంగల్లో బ్రిగేడ్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి నిర్వహించారు. పార్టీ యువజన విభాగం నాయకులు శంకర్ గౌడ్, రాజుపటేల్, రవిశంకర్ గౌడ్, వెంకట్తో పాటు పలువురు ఉన్నారు. బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో యూత్ సొసైటీ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి నిర్వహించారు.
మాక్లూర్ మండల కేంద్రంతోపాటు మండంలోని గ్రామాల్లో స్వామి వివేకానంద జయంతి యువజన సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో వివేకానంద చైతన్య సేవాసమితి ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని నిర్వహించారు.
నవీపేట మండల కేంద్రంలో స్వామి వివేకా నంద జయంతి బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో రెడ్రోల్ యూత్ ఆధ్వర్యంలో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెడ్రోజ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. వేల్పూర్లో రెడ్క్రాస్ సొసైటీ వైస్చైర్పర్సన్ డొల్ల రాజేశ్వర్రెడ్డి ఇటీవల గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నందున,రామన్నపేట్ జడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్న తెలుగు పండిత్ నాగరాజును సన్మానించారు.
కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలో హన్మంత్ రెడ్డి స్మారక గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వివేకానందుడి విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఆర్మూర్ మున్సిపాల్ పరిధిలోని పెర్కిట్ మహిళా ప్రాంగణంలో వివేకానంద జయంతి నిర్వహించారు. ముప్కాల్ మండల కేంద్రంతోపాటు నల్లూర్, కొత్తపల్లి, రెంజర్ల, వేంపల్లి గ్రామాల్లో వివేకానంద జయంతి నిర్వహంచారు.