రామారెడ్డి, సెప్టెంబర్ 25: క్రీడలతో శారీరక ధ్రుడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. మండలంలోని ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం నిర్వహించిన 8వ జోనల్ స్థాయి క్రీడలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడాకారులకు క్రమశిక్షణ ముఖ్యమని అన్నారు.
ప్రతిఒక్కరూ సహాయ గుణాన్ని అలవర్చుకోవాని సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి గెలుపునకు నాంది కావాలన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థల చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హుస్సేన్, ఆర్సీవో మేరి ఏసుపాదం హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ కొత్తోళ్ల గంగారాం, జడ్పీటీసీ నారెడ్డి మోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి, ఎంపీటీసీ ఉమాదేవి, కాలేజీ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ సురేందర్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పాల్గొన్నారు.