శక్కర్నగర్/మోర్తాడ్/భీమ్గల్/ బోధన్ రూరల్/ నందిపేట్/జనవరి 14: బోధన్ పట్టణంలోని ఆచన్పల్లిలో రుద్ర కమ్యూనిటీ ఆధ్వర్యంలో భోగి వేడులను శనివారం ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేయడంతోపాటు, మహిళకు ముగ్గులు, పిల్లలకు గాలిపటాల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శివనాగేశ్వర్ రావు, నగేశ్ బాబు, రవి కుమార్, వెంకటేశ్వర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగార్జున గౌడ్, శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండలంలో భోగి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి గ్రామకమిటీల ఆధ్వర్యంలో భోగిమంటలు వేశారు.
భీమ్గల్ పట్టణంలోని నందిగల్లీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నందీశ్వర యూత్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమలత హాజరయ్యారు. గెలుపొందిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. అనంతరం చైర్పర్సన్ను కాలనీవాసులు సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మూత లత, భీమ్గల్ సొసైటీ డైరెక్టర్ మూత స్వామి, నర్సయ్య పాల్గొన్నారు.
బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం సర్పంచ్ రమావత్ రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. దివంగత సర్పంచ్ బుర్రి లత జ్ఞాపకార్థం ఈ ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బహుమతులను బుర్రి లక్ష్మణ్ అందజేశారు. ఉప సర్పంచ్ రాజు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
కమ్మర్పల్లి మండలంలోని హాసాకొత్తూర్లో శనివారం సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహా దేవ స్వామి ఆలయంలో మహిళలు, యువతులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజతేలకు బహుమతులు అందజేశారు. ఆర్.వనిత ప్రథమ, సీ.హెచ్.మాధవి ద్వితీయ, ఎం.దివ్య తృతీయ బహుమతి సాధించారు. సర్పంచ్ ఏనుగు పద్మా రాజేశ్వర్, వీడీసీ అధ్యక్షడు లావుడ్య వసంత్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వీడీసీ ఉపాధ్యక్షుడు ఏనుగు సందుల గంగారాం, సెక్రెటరీ లక్ష్మీ నారాయణ, క్యాషియర్ రమేశ్, భూషన్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
నందిపేట్ మండల కేంద్రంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. పాఠశాల, కళాశాల విద్యార్థినులు, యువతులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర నాయకుడు కె.గంగాధర్, మహిళలు పాల్గొన్నారు.