రామారెడ్డి, ఫిబ్రవరి 18: మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మండలంలోని మద్దికుంట శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం శివ పార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవం లో మాచారెడ్డి ఎంపీపీ లోయల పల్లి నర్సింగరా వు దంపతులు పాల్గొనగా.. మాజీ ఎమ్మెల్సీ షబ్బీ ర్ స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.
విరాళాలు ప్రకటించిన ప్రజాప్రతినిధులు
ఆలయ పునర్నిర్మాణానికి ప్రజాప్రతినిధులు విరాళాలు ప్రకటించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రూ.20 లక్షలు, ఎంపీపీ లోయలపల్లి నర్సిం గరావు రూ.11 లక్షలు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రూ.5 లక్షలు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇన్చార్జి వి.సుభాష్రెడ్డి 600 సిమెంట్ బ్యాగులు ప్రకటించారని వివరించారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం శివ-పార్వతులను రథంపై ఊరేగించారు.
రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు చోటుచేసుకోకుండా కామారెడ్డి డీఎస్పీ సురేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏ ర్పాటు చేశారు. కార్యక్రమంలో రామారెడ్డి ఎంపీ పీ నారెడ్డి దశరథరెడ్డి, మద్దికుంట గ్రామ సర్పంచ్ బొమ్మిడి రాంరెడ్డి, జడ్పీటీసీ నారెడ్డి మోహన్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి, పూజారులు ప్రభుస్వామి, గణేశ్, దిలీప్, బాలు, సాయి, వలంటీర్లు, వివిధ యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.