నిజామాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అతనో దివ్యాంగుడు. కదల్లేడు… ఏ పనీ చేసుకోలేని నిస్సహాయుడు. కామారెడ్డి శివారు పాత రాజంపేట గ్రామంలోని మెయిన్ రోడ్డు పక్కనే ఏండ్లుగా సొంత జాగలోనే గుడిసెలో నివాసం ఉంటున్నాడు. కామారెడ్డి – హైదరాబాద్ రాకపోకలకు ప్రధాన రహదారిగా ఉన్న ఈ ప్రాం తంలో కాలంతో సంబంధం లేకుండా దీనవస్థలో దినదినగండంగా జీవిసున్నాడు. దివ్యాంగుడు షేక్ ఖాదర్ పరిస్థితిని కండ్లారా చూసిన అప్పటి ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎలాగైనా ఈ నిరుపేద వ్యక్తికి సహాయంగా నిలవాలని నిశ్చయించుకున్నాడు. ఓ రోజు పాత రాజంపేటలో పర్యటనకు వచ్చిన సమయంలో షేక్ ఖాదర్ను పలుకరించగా తన ఇబ్బందులు గ్రహించి ప్రస్తుతం గుడిసె స్థానంలోనే ఇల్లు కట్టిస్తానని మాటిచ్చాడు. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం గంప గోవర్ధన్ ఇచ్చిన మాటకు కట్టుబడి షేక్ ఖాదర్కు సొంతింటిని నిర్మించాడు. ఇందులో ఖాదర్తోపాటు సోదరి సైతం ఉంటున్నారు. సొంత జాగాను వదిలి వెళ్లేందుకు ఇష్ట పడకపోవడంతో తన సొంత పైసలతోనే గంప గోవర్ధన్ ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాత రాజంపేట వాసులంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు.
రూ.9లక్షల వ్యయం..
షేక్ ఖాదర్ కొత్తింటి నిర్మాణానికి రూ.9 లక్షలు వెచ్చించారు. ఈ మొత్తాన్ని గంప గోవర్ధనే భరించారు. 80 గజాల విస్తీర్ణంలో బాధిత దివ్యాంగుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా నిర్మాణాన్ని చేపట్టా రు. హాలు, కిచెన్, ఒక చిన్నపాటి గది ని ఇందులో కల్పించారు. రంగు లు అద్దుకున్న కొత్త ఇల్లు వైభవోపేతం గా కనిపిస్తున్నది. ఏండ్లుగా గుడిసెను వదిలి వచ్చేందుకు ఇష్టపడని వ్యక్తి ఇన్నాళ్లకు సొంతింట్లోకి మకాం మార్చుతుండడం ఆనందంగా ఉందంటూ ప్రజలంతా చెబుతున్నారు. ఆదివారం ఉద యం షేక్ ఖాదర్ ఇంటి నిర్మాణ దాత గంప గోవర్ధన్ను చేతుల మీ దుగా గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామస్తులందరినీ ఈ కార్యక్రమానికి పిలుస్తున్నారు.
చాలా ఆనందంగా ఉంది…
రైల్వేగేట్ సమీపంలో వానలో తడుస్తూ, ఎండ, చలిని భరిస్తూ ఓ గుడిసెలో షేక్ ఖాదర్ నివాసం ఉండడాన్ని గమనించాను. దివ్యాంగుడైన ఖాదర్కు ఏదైనా సహాయం చేయాలని అనేక ప్రయత్నాలు చేశాను. కానీ ఖాదర్ తాను ఉంటున్న పూరిగుడిసెను వదిలి వెళ్లేందుకు అంగీకరించలేదు. తన ఇష్టపూర్వకంగానే రోడ్డు పక్కనే అదే 80గజాల విస్తీర్ణంలో ఇల్లు కట్టించి ఇచ్చాను. నాకు చాలా సంతృప్తిగా ఉన్నది.
– గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే