నిజామాబాద్ స్పోర్ట్స్,జనవరి 8: ఆర్మీలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు సైనికుల కుటుంబసభ్యులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఆర్థికసాయం అందజేశారు. చెవుల ప్రశాంత్, గంగాప్రసాద్, ఈగ జైపా ల్ విధి నిర్వహణలో మరణించగా, వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందజేసినట్లు ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి తెలిపారు.
సైనిక సంక్షేమ శాఖ సంచాలకుడు, రిటైర్డ్ కల్నల్ రమేశ్కుమార్ ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే నుంచి ఒక్కొక్కరికీ రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేయగా, ఆ చెక్కులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సోమవారం అందజేశారు.