పొలంలో పంట పండించాలనే ఆరాటం రైతుది. తమ ఆకలి తీర్చుకోవాలనే పోరాటం కొంగలది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్ర సమీపంలో వరి నాటు కోసం సోమవారం రైతు పొలాన్ని ట్రాక్టర్తో దమ్ము చేస్తుండగా, భూమిలో నుంచి బయటపడే పురుగులను తినడానికి కొంగలు పెద్దసంఖ్యలో వాలాయి. పొలంలో కొంగలు ఆహార పండుగను చేసుకుంటున్నాయా అన్నట్లుగా ట్రాక్టర్ చుట్టూ గుంపులుగుంపులుగా తిరుగుతుండగా నమస్తే కెమెరా కంటపడ్డాయి.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్