ధర్పల్లి, ఫిబ్రవరి 3 : జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. ధర్పల్లి మండలంలో కొనసాగుతున్న కంటివెలుగు కార్యక్రమానికి విశేష స్పంద లభిస్తున్నది. మండలకేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహం, ప్రాజెక్టు రామడుగు గ్రామంలో, కళాశాల, బెల్యా తండాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. వైద్యసిబ్బంది శుక్రవారం కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను అందజేశారు.
డిచ్పల్లి, ఫిబ్రవరి 3 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు-2 కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో చందర్నాయక్ అన్నారు. దేవానగర్ క్యాంప్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీవో గోపీబాబుతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేయాలని సూచించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. పక్కనే ఉన్న నర్సరీని పరిశీలించి ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటాలని ఆదేశించారు. వారి వెంట సర్పంచ్ ఖతీజా యూసుఫ్, ఉపసర్పంచ్ అల్వాల బుచ్చమ్మ, ఎంపీవో కిషన్రావు, పంచాయతీ కార్యదర్శి శ్రీవాణి తదితరులు ఉన్నారు.
ఆర్మూర్, ఫిబ్రవరి3: కంటి వెలుగు శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. శుక్రవారం ఆర్మూర్లోని 3 కంటి వెలుగు శిబిరాల్లో 485 మంది పరిశీలించి 71మంది కళ్లద్దాలను అందజేయగా 80 మందిని సర్జరీకి రిఫర్ చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్వో చంద్రమోహన్ తెలిపారు. 15రోజులుగా ఆర్మూర్లోని కంటి వెలుగు శిబిరాల్లో ఇప్పటి వరకు 4828 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 872 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. 694 మందిని సర్జరీకి రిఫర్ చేశారు.
బాల్కొండ, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలో కంటి వెలుగు శిబిరం కొనసాగుతోంది. శిబిరానికి విశేష స్పందన లభిస్తున్నదని కంటి వైద్యుడు నారాయణ తెలిపారు. ఆప్తాలమిస్ట్ రూప్రాజ్, సూపర్వైజర్ వాణి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
డొంకేశ్వర్, ఫిబ్రవరి3: మండల కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ చాయా ప్రారంభించారు. మెడికల్ ఆఫీసర్ సుచిత్ర, కంటి వెలుగు ఆఫీసర్ మమత కంటి పరీక్షలు నిర్వహించారు. మొదటి రోజు 146 మందికి కంటి పరీక్షలు చేసి, 53 మందికి కండ్ల అద్దాలు ఇచ్చారు. 46 మందికి ఆపరేషన్కు రిఫర్ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ నాయక్, ఎంపీటీసీ శ్రీకాంత్, జీపీ కార్యదర్శి శేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు.