దసరా పండుగను ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. సోమవారం విజయదశమిని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పలు పట్టణాలు, గ్రామాల్లో రావణ దిష్టిబొమ్మల వధ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.