ఖలీల్వాడి, మే 7: నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కోఆర్డినేటర్ భాస్కర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2నుంచి 5.20 గంటల వరకు పరీక్ష జరిగింది. మొత్తం 3183 మంది అభ్యర్థులకు 3142 మంది హాజరుకాగా, 41 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాల మేరకు ఒక గంట 5 నిమిషాలు అదనంగా సమయం ఇచ్చినట్లు కోఆర్డినేటర్ తెలిపారు.