ఏర్గట్ల/మాక్లూర్/ బాల్కొండ/ రెంజల్, డిసెంబర్3: ఏర్గట్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, సర్పంచ్ గుల్లే లావణ్య గంగాధర్ బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎన్సీడీ కిట్లను శనివారం అందజేశారు. దోంచందలో సర్పంచ్ గద్దే రాధాగంగారాం ఆధ్వర్యంలో కిట్లను అందజేశారు. కార్యక్రమంలో తాళ్ల రాంపూర్ సొసైటీ చైర్మన్ పెద్దకాపు శ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచ్ సోమిరెడ్డి శ్రీనివాస్, వార్డు సభ్యులు జీవన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జాకీర్, ఏఎన్ఎం కల్పన, హెల్త్ అసిస్టెంట్ పండరి పాల్గొన్నారు.
మాక్లూర్ పీహెచ్సీలో ఎన్సీడీ కిట్లను డాక్టర్ సంజీవ్రెడ్డి, సర్పంచ్ అశోక్రావు పంపిణీ చేశారు. ఎంపీటీసీ వెంకటేశ్వర్రావు, మండల కోఆప్షన్ సభ్యుడు అహ్మద్, సీహెచ్వో ఆనంద్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఎన్సీడీ కిట్లను ఏఎన్ఎం లలితాదేవి, సర్పంచ్ వనజా గోవర్ధన్గౌడ్ పంపిణీ చేశారు. ఆశ వర్కర్లు సహారా భాను, అనిత పాల్గొన్నారు.
రెంజల్ మండలంలోని కందకుర్తి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఆవరణలో ధీర్ఘకాలిక వ్యాధి గ్రామస్తులకు ఎన్సీడీ కిట్లను అందజేశామని సర్పంచుల ఫోరం జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు, సర్పంచ్ ఖలీంబేగ్ తెలిపారు. కార్యక్రమంలో నీలా విండో చైర్మన్ ఇమ్రాన్బేగ్, ఉప సర్పంచ్ యోగేశ్, ఎంపీటీసీ అసద్బేగ్, అరోగ్య విస్తరణ అధికారులు శ్రావణ్కుమార్, రవీందర్, ఏఎస్ఎం జానకి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకుడు మోసిన్బేగ్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.