విద్యానగర్, డిసెంబర్ 9 : ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో జడ్పీ హైస్కూల్ నుంచి బృందావన్ గార్డెన్ వరకు సుమారు రూ. 9కోట్ల 60 లక్షల నిధులతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు శుక్రవారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా విప్ మాట్లాడు తూ.. పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పుష్కలంగా నిధులు విడుదల చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రా వు, మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి ఆంజనేయు లు, వైస్ చైర్మన్ కుంబాల రవియాదవ్, వార్డు కౌ న్సిలర్లు గోదావరీ స్వామి, కృష్ణాజీరావు, ఉరుదొండ వనితా రవి, నాయకులు ముప్పారపు ఆనంద్, గడ్డం చంద్రశేఖర్రెడ్డి, నిట్టు వెంకట్రావు, కాసర్ల రవీందర్, నిట్టు లింగారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.