నందిపేట్, జూన్ 28 : నందిపేట పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని, ఇందుకోసం రూ. 24కోట్లు మంజూరుచేసినట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్యనాయకులతో బుధవారం సమావేశమయ్యారు. నందిపేట్లోని ప్రధాన రోడ్డు తళుక్కుమనేలా సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మొత్తం 24 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు.ఇందులో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువ, మధ్యలో సెంట్రల్ లైటింగ్, సుందరీకరణకు రూ.12 కోట్లు, 16 వార్డుల్లో మురికి కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు రూ.4 కోట్ల 50 లక్షలు, అలాగే పద్మశాలీ, మున్నూరుకాపు, గొల్లకుర్మ, ముస్లిం, గౌడసంఘం కమ్యూనిటీ హాళ్లతో పాటు ఆయా కులసంఘాల భవనాలకు ఐదున్నర కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఇందులో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని, త్వరలోనే అవి పూర్తవుతాయని తెలిపారు. రోడ్లు, మురికికాలువలు, సెంట్రల్ లైటింగ్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. అవి కూడా అతి త్వరలోనే పనులు పూర్తి చేసి స్థానికులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అంద రూ నాయకులు, ప్రజలు కలిసికట్టుగా ఉండి అభివృద్ధిచేసుకోవాలని సూచించారు. అభివృద్ధి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారుడికి చేరడానికి నాయకులు, కార్యకర్తలు ముందుండి పని చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. గతంలో కన్నా రెట్టింపు మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారికి సేవ చేయడమే తన ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న పద్మశాలీ సంఘం కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ సంతోష్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్, నాయకులు ఉల్లి శ్రీనివాస్గౌడ్, ఎర్రం ముత్యం, బాలగంగాధర్, సుదర్శన్, మజారుద్దీన్, లక్ష్మీనారాయణ, ఉపసర్పంచ్ భరత్, వార్డు సభ్యులు ఉన్నారు.