బాల్కొండ, జనవరి 25: నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఎంపీ అర్వింద్ విమర్శిస్తే సహించేది లేదని బాల్కొండ బీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీశ్రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, లింగాగౌడ్, దాసరి వెంకటేశ్, బూస నరహరి, నాగులపల్లి రాజేశ్వర్ అన్నారు. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్నో కుల సంఘాలు, దేవాలయాలకు, మసీదులు, చర్చిలకు నిధులు మంజూరయ్యాయని, సెంట్రల్ లైటింగ్, చెక్డ్యామ్లు, కొత్తగా గ్రామపంచాయతీ భవనాలు ఇలా మంత్రి ఎన్నో అభివృద్ధి పనులకు మంత్రి నిధులు తెస్తున్నారని అన్నారు. ఎంపీ అర్వింద్ బాల్కొండ మండలంలో ఒక్కసారైనా పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. మంత్రిని విమర్శిస్తే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో సొసైటీ చైర్మన్ సూరజ్రెడ్డి, ఉపసర్పంచ్ వాహెబ్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సాగర్యాదవ్, కోఆప్షన్ మెంబర్ ఫయాజ్, కన్నా పోశెట్టి, రాకేశ్ పాల్గొన్నారు.
మోర్తాడ్, జనవరి25: రైతులను బాండ్పేపర్తో మోసం చేసిన ఎంపీ అర్వింద్ మంత్రి ప్రశాంత్రెడ్డిపై తరచూ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని, ఇకనైనా అబద్ధాలు మాట్లాడడం మానుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ హెచ్చరించారు. మోర్తాడ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీగా గెలిచి బాల్కొండ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశావని ప్రశ్నించారు. సమావేశంలో సర్పంచ్ బోగధరణీ ఆనంద్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు చేయడం చేతగాక మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పై ఆరోపణలు చేసిన ఎంపీ అర్వింద్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, మండల నాయకులు అన్నారు. కమ్మర్పల్లిలో మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీలు మైలారం సుధాకర్, పిప్పెర అనిల్, నాయకులు హల్దె శ్రీనివాస్, లోలపు సుమన్, అజ్మత్ హుస్సేన్, కొత్తపల్లి రఘు, మల్కాయి రాజన్న, నవీన్గౌడ్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.