బోధన్ రూరల్, జనవరి 11: ప్రజలందరూ కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు. మండలంలోని సాలూరా వద్ద వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చెక్పోస్టును ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వైద్యసిబ్బందికి పలు సూచనలు చేశారు. మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, అక్కడి నుం చి తెలంగాణలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ టెస్టు చేయాలని సూచించారు. పాజిటివ్ అని తేలితే వారిని వెంటనే మహారాష్ట్రకే పంపించాలన్నారు. ఆయన వెంట సాలూరా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ తదితరులు ఉన్నారు.
బూస్టర్డోస్ టీకాల పంపిణీ ప్రారంభం..
బోధన్, జనవరి 11: పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో బూస్టర్ డోస్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బోధన్ ఆర్డీవో రాజేశ్వర్కు మొదట టీకాను ఇచ్చారు. అనంతరం దవాఖానలోని వైద్య సిబ్బందికి టీకాలు వేశారు. మంగళవారం మొత్తం 30 మందికి టీకాలు వేసినట్లు ఆర్ఎంవో డాక్టర్ సందీప్ తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విద్య, సూపర్వైజర్ గ్రేసీ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్..
ఏర్గట్ల, జనవరి 11: అర్హులైన ప్రతిఒక్కరూ కొవిడ్ టీకాలు తీసుకోవాలని మండల వైద్యాధికారిణి స్టెఫీరాణి అన్నారు. ఏర్గట్లలోని వ్యాక్సినేషన్ సెంటర్లో ఆమె వైద్యసిబ్బందితో కలిసి పలువురికి టీకాలను ఇచ్చారు. ఏఎన్ఎం కల్పన, హెల్త్ అసిస్టెంట్ పండరి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.