MLA Sudarshan Reddy | శక్కర్ నగర్ : బోధన్ సమీకృత పాఠశాల భవనం పనులు ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు. బోధన్ పట్టణం బెల్లాల్ శివారులో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల భవన సముదాయ స్థలాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల పిల్లల సంక్షేమం కోసం ఒకే స్థలంలో సుమారు 2500 మంది విద్యార్థులు విద్యాబ్యాసానికి గాను, 20 ఎకరాల స్థలం, సువిశాలమైన మైదానం తో ఈ భవన నిర్మాణం కొనసాగుతోందన్నారు.
ఈ భవనం పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, జాప్యం లేకుండా నిర్దేశించిన ఏడాదిన్నార కాలంలో పూర్తి చేయాలని సుదర్శన్ రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భుజంగ రావు, సంబంధిత అధికారి రఘుపతి రెడ్డి, బోధన్ ఆర్డీవో విజయ కుమారి, విద్యుత్ శాఖ డీఈఈ ముక్తార్ అహ్మద్, నాయకులు తాహెర్ బిన్ హందాన్, అంతిరెడ్డి రాజి రెడ్డి, గంగా శంకర్, పాషా మొయినొద్దీన్, నాగేశ్వర్ రావు, పులి శ్రీనివాస్, తూము శరత్ రెడ్డి, తలారే నవీన్తో పాటు పలువురు పాల్గొన్నారు.