ఖలీల్వాడి, డిసెంబర్ 23 : నగరంలోని ఆర్యూబీ రైల్వేకమాన్ వద్ద బీటీ రోడ్డు నిర్మాణ పనులను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లమ్మగుట్ట రైల్వేకమాన్ వద్ద ఆర్యూబీ నిర్మించడంతో బ్యాంకు కాలనీకి వెళ్లే రోడ్డు ధ్వంసం అయ్యిందని, రూ.95 లక్షల నిధులు మంజూరు చేసి బ్యాంకు కాలనీకి వెళ్లే రోడ్డును పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, కార్పొరేటర్ న్యాలం నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు నాయిని సుజన్, గోపరి లక్ష్మణ్, యెండల ప్రసాద్, యెండల ప్రదీప్, గంగామణి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఖలీల్వాడిలో నిర్మిస్తున్న వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్సపల్లి, దుబ్బలో నిర్మిస్తున్న వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగంగా, నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో నగరమేయర్ దండు నీతూకిరణ్, బీఆర్ఎస్ కార్పోరేటర్లు, నాయకులు, పబ్లిక్ హెల్త్ అధికారులు, మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.