Kotagiri | కోటగిరి, ఫిబ్రవరి 15 : గీత కార్మికుల హక్కుల కోసం, గీత సొసైటీల ఏర్పాటు కోసం కృషి చేసిన మహానీయుడు కామ్రేడ్ ధర్మభిక్షం అని తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు. కామ్రేడ్ ధర్మ భిక్షం జయంతి పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో కామ్రేడ్ ధర్మభిక్షం 104 వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని సర్కార్ దావఖానలో విఠల్ గౌడ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విఠల్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల ఆశాజ్యోతి అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు గీత కార్మికుల కుటుంబాలకు ఆశాజ్యోతి కామ్రేడ్ ధర్మభిక్షం అని గుర్తు చేశారు.
ఆయన పోరాట ఫలితంగానే ఐదు ఎకరాలు భూమి, వన పెంపకం, పెన్షన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఠల్ గౌడ్ తో పాటు నరేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజా గౌడ్ కృష్ణ గౌడ్, వెంకా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.