ధర్పల్లి/భీమ్గల్, మార్చి 19 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీన్మార్ మల్లన్న, క్యూ న్యూస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రూరల్ జాగృతి కన్వీనర్ మల్లెల సాయిచరణ్ ఆదివారం ఎస్సై వంశీకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే మీడియాను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో రూరల్ విద్యార్థి కన్వీనర్ రాము, యూత్ కో కన్వీనర్ విక్కీ, ధర్పల్లి మండల కన్వీనర్ గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. జాగృతి బాల్కొండ నియోజకవర్గ కన్వీనర్ సతీశ్గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా కోశాధికారి ధీరజ్, సభ్యులు నాగరాజు, శ్రీనివాస్, అరుణ్, ఆసిఫ్ తదితరులు ఉన్నారు.