నందిపేట్, జూలై 17: అసైన్డ్ భూములను అడ్డదారిలో రిజిస్ట్రేషన్లు చేసినందుకు నందిపేట్ తహసీల్దార్పై కలెక్టర్ ఇలా త్రిపాఠి వేటువేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో అసైన్డ్ భూములను తహసీల్దార్ సంతోష్రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఆర్మూర్ సబ్కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాతో కలెక్టర్ విచారణ జరిపించారు.
విచారణలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో తహసీల్దార్పై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. కలెక్టర్ గురువారం తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడి ప్రభుత్వ, అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నదని, నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. హెచ్చరించిన మరుసటి రోజే తహసీల్దార్పై చర్యలు తీసుకోవడం గమనార్హం.