కామారెడ్డి/ కంఠేశ్వర్, మార్చి 14: ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’లతో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. గురువారం ఆమె హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా మాట్లాడారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగం గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను స్వశక్తి మహిళా సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గ్రామంలో 23 మహిళా సంఘాలు ఉంటే పాఠశాలలకు దగ్గరగా ఉన్న మహిళా సంఘానికి మొదటి సంవత్సరం అవకాశం కల్పించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనులను గుర్తించి కలెక్టర్లు వెంటనే పరిపాలన అనుమతులు మంజూరు చేసి జిల్లా సమాఖ్యకు అప్పగించాలని ఆదేశించారు. కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, సీపీవో రాజారాం, డీఆర్డీవో చందర్ నాయక్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి రజిత, నిజామాబాద్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్ అంకిత్, డీఈవో దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.