రెంజల్,ఫిబ్రవరి 12: సాటాపూర్ వార సంతలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నాబార్డు ద్వారా నిధుల మంజూరుకు కృషి చేస్తానని చీఫ్ జనరల్ మేనేజర్ చింతల సుశీల అన్నారు. సాటాపూర్లో నాబార్డ్, జీపీ నిధులతో నిర్మించిన (మార్కెట్యార్డు) షెడ్లు, గదిని సోమవారం ఆమె ప్రారంభించారు. డీజీఎం శ్రీనివాస్, డీడీఎం ప్రవీణ్కుమార్, ఎస్ఐడీఎస్ ఈడీ గంగాధర్రావు, జడ్పీటీసీ మేక విజయాసంతోష్ పాల్గొన్నారు.