మాక్లూర్, డిసెంబర్ 7 : జీవం ఉట్టిపడేలా పెయింటింగ్ వేస్తూ.. కుంచె కదిపితే అద్భుత చిత్రాలకు రూపమిస్తూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఔరా అనిపిస్తున్నారు. సామాజికంగా ప్రస్పుటమయ్యే అంశాల పై ఆయన చిత్రాలు భావాలను పలికిస్తా యి. చిత్రాలను కండ్లకు కట్టినట్లు చూప డంలో ఆయన నైపుణ్యానికి నిదర్శనం. మాక్లూర్ మండలం అమ్రాద్ జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రమేశ్ వేసిన చిత్రాలను చూసినవారంతా బొమ్మల రమేశ్గా పిలుస్తుండడం విశేషం.
ఐదో తరగతి నుంచే..
ఐదో తరగతి చదువుతున్నప్పుడే రమేశ్ చిత్రకళకు ఆకర్షితుడయ్యారు. పాఠశాలతోపాటు ఇంటి వద్ద సొంతంగా సాధన చేశారు. ఆ సాధనే అతనిని చిత్రలేఖన ఉపాధ్యాయ కొలువు సాధించేలా చేసింది. అంతటితోనే ఆగకుండా తాను పనిచేసే ప్రతి పాఠశాల నుంచి కనీసం ఐదుగురు విద్యార్థులు జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీలకు ఎంపికయ్యేలా కృషి చేశారు. చిత్రలేఖనం,శిల్పకళా పోటీల్లో ఉత్తమ కళాకారుడిగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు.
సందేశాత్మక చిత్రాలు..
రమేశ్ ప్రతి రోజూ బొమ్మలు వేస్తారు. నిద్రలో వచ్చిన కలలను తెల్లని కాగితంపై ఆవిష్కరిస్తారు. సమాజానికి ఉపయోగపడే ఎన్నో సందేశాత్మక చిత్రాలు ఆయన కుంచె నుంచి జాలువారాయి. పెన్సిల్ వర్క్, వాటర్ కలర్ పెయింటింగ్లో అందెవేసిన చేయి. ఇప్పటి వరకు 2వేలకు పైగా చిత్రాలను గీశారు. పాఠశాలలో మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్, అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్రాలను ఆవిష్కరించారు. ఈయన వేసిన గ్రామీణ అందాలు, ప్రకృతి ఒడి, బాల కార్మికుల జీవనం, మనస్సుకు ఆహ్లాదం కలిగించే రమణీయ దృశ్యాలు, వినాయకుడు, సాయిబాబ, ఆంజనేయ స్వామి, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, పక్షులు, పుష్పాలు తదితర చిత్రాల్లో జీవం ఉట్టిపడుతుంది. నిలబడ్డ చోటే వ్యక్తులకు చిత్రరూపం ఇవ్వడంలో దిట్ట.
రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక..
తాను నేర్చుకున్న కళను శిష్యులకూ నేర్పుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు. చిత్రలేఖనం పట్ల ఆసక్తి కనబర్చే విద్యార్థులకు మెళకువలను నేర్పుతున్నారు. బొమ్మలు ఎలా గీయాలో, పెన్సిల్ ఎలా పట్టాలో శిక్షణనిస్తున్నారు. రమేశ్ వద్ద శిక్షణ పొందిన విద్యార్థుల్లో పది మంది రాష్ట్రస్థాయి, ఐదుగురు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై బహుమతులు, ప్రశంసాపత్రాలు, నగదు ప్రోత్సాహకాలను అందుకున్నారు.
మట్టి వినాయకుల తయారీ..
నిజామాబాద్ నగరం పోచమ్మగల్లీలో ఏటా ఏర్పాటు అతి పెద్ద మట్టి వినాయకుని విగ్రహానికి రమేశ్ రూపకల్పన చేస్తారు. గణపతి ఉత్సవాల సమయంలో మట్టి విగ్రహాలను తయారు చేసి అమ్రాద్ గ్రామంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఉచితంగా పంపిణీ చేస్తారు.
ప్రకృతి అందాలపైనే..
ప్రకృతి అందాలనే కథా వస్తువులుగా తీసుకొని చిత్రాలు గీస్తాను. గ్రామీణ సౌందర్యాలు, ప్రకృతి మనోహరాలు, పల్లె జీవనం, మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ప్రకృతికి వాటిల్లుతున్న నష్టాలను చిత్రాల రూపంలో ఆవిష్కరిస్తా. ఆ దిశగా చిత్రకళా పయనం సాగిస్తా. ఇంటికి వచ్చే వారు తాను వేసిన చిత్రాలను చూసి బొమ్మల రమేశ్గా పిలుస్తుండడం కానుకగా స్వీకరిస్తా..
-రమేశ్, చిత్రలేఖన ఉపాధ్యాయుడు, అమ్రాద్
పురస్కారాలు..