బోధన్ రూరల్, జనవరి 21: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను ప్రారంభిస్తోందని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. శనివారం కొప్పర్గ గ్రామంలో పల్లె దవాఖాన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.20 లక్షలలో పల్లె దవాఖానను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉప సర్పంచ్ ఖలీల్ గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బుద్దెసావిత్రీ రాజేశ్వర్, ఏఎంసీ చైర్మన్ వీఆర్దేశాయి, వైస్ చైర్మన్ సాలూరా షకీల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సన్న, డీసీసీబీ డైరెక్టర్ శరత్, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో మధుకర్, నాయకులు బుద్దెరాజేశ్వర్, జమీల్, హంగర్గ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
శక్కర్నగర్, జనవరి 21: బోధన్ పట్టణంతో పాటు డివిజన్లోని విశ్వబ్రాహ్మణులకు చేయూతనందించాలని కోరుతూ ఆ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు వడ్ల సతీశ్ కుమార్తోపాటు నాయకులు బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్కు వినతిపత్రం అందజేశారు. శనివారం ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ను ఆయన నివాసంలో కలిశారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారు కొందరు తాము చేస్తున్న వృత్తులు చేపట్టడంతో తమకు ఇబ్బందిగా మారుతోందని అన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాజేశ్వర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్ల సతీశ్చారితోపాటు వడ్ల గణేశ్చారి, వడ్ల లాలయ్య చారి తదితరులు పాల్గొన్నారు.