డిచ్పల్లి, మే 29 : ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్పై అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకుడు దినేశ్కుమార్ను నియోజకవర్గ ప్రజలు తరిమికొడుతారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నాయకులు ఓవైపు మంచిప్ప,మాసాని పరిసర ప్రాంతాల్లో భూము లు ఇవ్వకుండా రైతులను రెచ్చగొడుతూ పనులను అడ్డుకుంటున్నారని, మరో వైపు రూరల్ నియోజ కవర్గంలో ఉన్న రైతులకు లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం లేదని దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపు తున్నారని విమర్శించారు.
బాజిరెడ్డి గోవర్ధన్ చేపడుతు న్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీజేపీ నాయకు లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. రైతు ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి కాలువలలో చెక్డ్యాములను నిర్మించి, భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు చేపట్టిన ఘనత బాజిరెడ్డి గోవర్ధన్కే దక్కుతుంద న్నారు. మంచిప్ప మాసాని ప్రాజెక్టు పూర్తయి, వ్యవసాయభూములకు సాగునీరందితే ప్రజలు తమవైపు చూడరనే భయంతో కాంగ్రెస్, బీజేపీ నాయ కులు ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించా రు. సమావేశంలో టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షు డు మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.