నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 29 : జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో మహిళలు బతుకమ్మ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలో వివిధ సంఘాలు, శాఖల ఆధ్వర్యంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు. నూతన కలెక్టరేట్ కార్యాలయంలో టీఎన్జీవోస్, మున్సిపల్ ఆధ్వర్యంలో సంబురాలను నిర్వహించారు. ఉద్యోగినులు వారి కుటుంబీకులతో హాజరై ఆడిపాడారు. జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి దంపతులు, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, మేయర్ నీతూకిరణ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కోలాటం ఆడి ఉత్సాహపర్చారు. అంతకుముందు బతుకమ్మలకు పూజలు చేశారు.
తెలంగాణ సాంస్కృతిక సారథి సాయి లవోల బృందం సభ్యులు, అష్ట గంగాధర్ తమ ఆటపాటలతో హుషారు నింపారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, డీఎంహెచ్వో సుదర్శనం, టీఎన్జీవోస్ సంఘం జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, కార్యదర్శి అమృత్కుమార్, జిల్లా జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, డీడబ్ల్యూవో సౌందర్య, డీఎస్సీడీవో శశికళ, పీఆర్టీయూ అధ్యక్షుడు మోహన్రెడ్డి, సూపరింటెండెంట్ ఇందిర, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వర్ని మండల కేంద్రంలోని వడ్డేపల్లిలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి దంపతులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
జిల్లాకేంద్రంలోని నలంద హైస్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించగా.. మేయర్ నీతూకిరణ్ హాజరై విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. జిల్లాకేంద్రంలోని నిశితా డిగ్రీ కళాశాలలో, కోటగిరి మండలంలోని పాత పొతంగల్, కొల్లూర్, యాద్గార్పూర్, ఎత్తొండ, కొత్తపల్లిలో, డిచ్పల్లి మండలంలోని సాంపల్లిలో, కమ్మర్పల్లిలోని జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో, బాల్కొండ మండలంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో, ఆర్మూర్ పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో, టెక్నో సాఫ్ట్ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో, మాక్లూర్ మండలంలోని విజయ్, కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాలల్లో, నవీపేట్ మండల కేంద్రంలో, రెంజల్ మండలంలోని రెంజల్, సాటాపూర్, బోర్గాం, తాడ్బిలోలి గ్రామాల్లో, బోధన్ మండలంలోని అమ్దాపూర్, ఎరాజ్పల్లిలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు.