నిజామాబాద్ క్రైం, మే 13 : ప్రతి ఆటోడ్రైవర్ యూనిఫామ్ లేని పోలీస్ అని, క్రమశిక్షణతో మెలగాలని నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సీహెచ్.ప్రవీణ్కుమార్ ఆదేశాల మేరకు జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్లో ‘మై ఆటో ఈజ్ సేఫ్’ యాప్పై ఆటో డ్రైవర్లు, ఓనర్లకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటోలో ఎక్కిన ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేర్చే బాధ్యత ప్రతి ఆటోడ్రైవర్పై ఉందని, ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుమారు 8 వేల ఆటో రిక్షాలు, 500 క్యాబ్లు ఉన్నాయని, ప్రయాణికులకు మరింత భద్రత, సౌకర్యం కల్పించేందుకు మై ఆటో ఈజ్ సేఫ్ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. పోలీసులు ఆటోడ్రైవర్లను సోదర భావంతో చూడాలని సూచించారు. మై ఆటో ఈజ్ సేఫ్లో వివరాలు నమోదు చేసుకున్న ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్ ఉంటుందని, తద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్టీసీ డిపో-1, 2 మేనేజర్లు ఆనంద్, వెంకటేశ్, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, వన్టౌన్ ఎస్హెచ్వో విజయ్బాబు, నగర సీఐ వెంకట్ నారాయణ, ఎస్సైలు ఉదయ్ కుమార్, పూర్ణేశ్వర్, శ్రావణ్ కుమార్, సందీప్, ఆటో, క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు.