రామారెడ్డి, డిసెంబర్14 : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామంలో వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గుహలోని బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సంఘటన చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన షాడ రాజు మంగళవారం కన్నాపూర్, సింగరాయిపల్లి అటవీ శివారు ప్రాంతంలో వేటకు వెళ్లాడు. అటవీ ప్రాంతంలో వేటాతుండగా రాళ్లపై నుంచి గుహలో పడిపోయాడు. రాజు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అటవీ ప్రాంతంలో వెతుకుతుండగా గుహ నుంచి కేకలు వినిపించడంతో రామారెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ టీమ్ను తెప్పించి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సంఘటనా స్థలానికి కామారెడ్డి అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం, కామారెడ్డి రూరల్ సీఐ, శ్రీనివాస్, రామారెడ్డి మండల వైద్యాధికారి డాక్టర్ షాహీద్ అలీ చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు.