తాడ్వాయి, జనవరి 29 : మండలంలోని సంతాయిపేట అటవీప్రాంతంలో ఏదును వేటాడి చంపిన ముగ్గురు వ్యక్తులను శనివారం రాత్రి పట్టుకున్నట్లు కామారెడ్డి ఫారెస్టు అధికారి రమేశ్ తెలిపారు.
పోచారం అభయారణ్యమైన సంతాయిపేట శివారులో జంతువులను వేటాడుతున్నారనే సమాచారం మేరకు తనిఖీ చేయగా ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. వారిని వెంబడించగా సంతాయిపేటకు చెందిన సూర స్వామి, దేవునిపల్లికి చెందిన దాసరి పెండ్యాల, నరేందర్ కామారెడ్డి సమీపంలో దొరికారు. వీరి నుంచి చంపి తీసుకెళ్తున్న ఏదు కళేబరాన్ని స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.