న్యూఢిల్లీ: కేంద్ర సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం 2021-22 విద్యాసంవత్సరానికిగాను అర్హులైన ఎస్సీల నుంచి పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చదువుతున్న కోర్సుల ఆధారంగా ప్రతి ఏడాది రూ.2500 నుంచి రూ.13,500 వరకు అందిస్తారు. ఇలా ఐదేండ్లలో మొత్తం రూ.63 లక్షలు చెల్లిస్తారు.
అర్హత: ఇంటర్ ఆపై ఉన్నత విద్య చదువుతున్నవారై ఉండాలి. ఎస్సీ విద్యార్థులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు.
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్: www.socialjustice.nic.in