నిజామాబాద్ కల్చరల్, డిసెంబర్ 29: ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలు యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో ఇందూరు యువత 12వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ అర్వింద్, అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుపా,్త పైడి రాకేశ్రెడ్డితోపాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ హాజరయ్యారు. ఇందూరు యువత సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. అనంతరం పలు విద్యాసంస్థల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
జిల్లా కేంద్రానికి చెందిన సాయి దేవిక అనారోగ్యంతో బాధపడుతుండడంతో బాధిత కుటుంబానికి రూ.45వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, దారం గంగాధర్, స్రవంతి రెడ్డి, సాయితేజ్ తదితరులు పాల్గొన్నారు.