ఖలీల్వాడి, జూన్ 25: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు ‘యునైటెడ్ వే’ సహకారంతో బాల వికాస ఆధ్వర్యంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వినోద్, విమల, ప్రభుత్వ దవాఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసేవ చేయడం అలవర్చుకోవాలి
ప్రతి ఒక్కరూ ప్రజా సేవ చేయడం అలవర్చుకోవాలని కోటగిరి గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అన్నారు. మండలకేంద్రంలోని వివేకానంద హైస్కూల్ ఆవరణలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రామకృష్ణ సేవా సమితికి కరోనా కష్ట సమయంలో శ్రీరాణి-సునీల్ దంపతులు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి సభ్యులు గోగినేని శివ శ్రీనివాస్, రజిని, గోగినేని హన్మంతరావు, ఎత్తొండ ఉప సర్పంచ్ సుజాత దేవేందర్, పోలవరపు హరికృష్ణ, మండవ ఆదినారాయణ వెలగ చౌదరి, గంట్ల విఠల్, హన్మంతరావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.