నిజాంసాగర్, ఫిబ్రవరి 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయని కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు అన్నారు. మండలంలోని నర్వ గ్రామంలో మన ఊరు – మనబడి నిధులతో మౌలిక వసతులను పూర్తి చేసుకున్న పాఠశాలను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్నివర్గాలకు సముచిత న్యాయం చేసేలా పథకాలను ప్రవేశపెడుతున్నారని కొనియాడారు.
విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులతోపాటు సన్నబియ్యంతో భోజనం, గురుకుల, మైనార్టీ, ఆదర్శ పాఠశాలలను సైతం ఏర్పాటు చేసి కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, డీఈవో రాజు, ఎంపీపీ పట్లోళ్ల జ్యోతీదుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, సొసైటీ చైర్మన్లు వాజిద్అలీ, నర్సింహారెడ్డి, కల్యాణీవిఠల్రెడ్డి, ఎంఈవో దేవీసింగ్, సర్పంచులు గంగామణి, సంగమేశ్వర్గౌడ్, అంజయ్య, చందర్, నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణ, రెడ్యానాయక్, విజయ్, కాశయ్య, అప్జల్, ఇప్తాకర్, నర్సింహులు, రాజేశ్వర్గౌడ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.