హైదరాబాద్ జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అపూర్వ ప్రగతిని సాధిస్తూ, దేశానికి మార్గదర్శిగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రం బంగారు తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసుకొంటుందనే విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.