సూర్యాపేట : టిప్పర్ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో యువకుడు దుర్మరణం చెందాడు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రెంటచింతల మండలం మిట్టగుడిపాడు గ్రామానికి చెందిన కొమెర నాగేశ్వరరావు(26) తన పిన్నితో కలిసి బైక్పై మేళ్లచెర్వులోని తన బంధువుల ఇంటికి బయల్దేరాడు.
మఠంపల్లి మండలం సాగర్ సిమెంట్స్ వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో నాగేశ్వరరావు తల, ఛాతీ భాగంలో తీవ్రగాయాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు మఠంపల్లి మండలంలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు సమాచారం. మృతుడికి భార్య, నెల వయసు కుమారుడు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా దవాఖానకు తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.