ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఓపెనర్ దేవదత్ పడిక్కల్ జట్టు ట్రైనింగ్ క్యాంప్లో చేరాడు. తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో అతనికి నెగెటివ్ వచ్చింది. శుక్రవారం ఆర్సీబీ టోర్నీ ఆరంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది.గత సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన పడిక్కల్ నిలకడగా రాణించి 473 పరుగులు చేశాడు.
‘నేను క్షేమంగా ఉండాలని ఆకాంక్షిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. రెండు వారాల క్రితం నాకు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. బీసీసీఐ, ఐపీఎల్ ప్రొటోకాల్స్ ప్రకారం..నేను రెండు వారాలు ఇంట్లోనే క్వారంటైన్లోనే ఉండాల్సి వచ్చింది. వరుసగా రెండు టెస్టుల్లో నెగెటివ్ రావడంతో క్యాంప్లో చేరాను. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నా. ఆర్సీబీ శిబిరంలో చేరడానికి నేను ఇక వేచి ఉండలేను’ అంటూ ఆర్సీబీ ట్వీట్ చేసిన వీడియోలో పడిక్కల్ పేర్కొన్నాడు.