న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 577 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ (EO), అకౌంట్స్ ఆఫీసర్ (AO), అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ను ఫిబ్రవరి 25న విడుదలైన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రచురించింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేయాల్సి ఉంది.
మొత్తం పోస్టులు: 577
ఇందులో ఈవో లేదా ఏవో పోస్టులు 418 (జనరల్ 204, ఎస్సీ 57, ఎస్టీ 28, ఓబీసీ 78, ఈడబ్ల్యూఎస్ 51, పీడబ్ల్యూడీ 25), ఏపీఎఫ్సీ 159 (జనరల్ 68, ఎస్సీ 25, ఎస్టీ 12, ఓబీసీ 38, ఈడబ్ల్యూఎస్ 16, పీడబ్ల్యూడీ 28) చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు ఏవో పోస్టులకు 30 ఏండ్లు, ఏపీఎఫ్సీ 35 ఏండ్ల వయస్సు లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.25, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 25
అప్లికేషన్లకు చివరితేదీ: మార్చి 17
వెబ్సైట్: upsconline.nic.in లేదా upsc.gov.in