న్యూఢిల్లీ: అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్ఎఫ్కు అర్హత కల్పించే యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష జూన్ నెలలో నిర్వహించనున్నారు. జూన్ మొదటి లేదా రెండో వారంలో పరీక్షను నిర్వహించే అవకాశం ఉందని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ చెప్పారు. గత డిసెంబర్లో జరగాల్సిన నెట్ను కరోనా కారణంగా నిర్వహించలేదు. దీంతో డిసెంబర్, జూన్ సెషన్లను ఒకేసారి నిర్వహిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. తేదీలను ఇంకా నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పారు.
పీజీ పూర్తిచేసిన వారు జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయాలంటే యూజీసీ నెట్లో క్వాలిఫై అవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతిఏటా రెండుసార్లు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) నిర్వహిస్తున్నది. అయితే గతేడాది డిసెంబర్ సెషన్ కరోనా కారణంగా జరగలేదు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తున్నది.