హైదరాబాద్ : తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టులకు ఇటీవలే రాత పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. మెరిట్ లిస్ట్ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. మొత్తం 127 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా, 5885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3968 మంది రాత పరీక్షకు హాజరు కాగా, 26 మంది పేపర్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. మొత్తంగా 3942 మంది మెరిట్ లిస్ట్ను విడుదల చేశారు.