ఎంటెక్, ఎం ఫార్మసీ, అర్కిటెక్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ఫలితాలు శనివారం (సెప్టెంబర్ 3) విడుదల కానున్నాయి. 3న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఫలితాలను చైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నట్లు కన్వీనర్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
టీఎస్ పీజీఈసెట్ను ఆగస్టు 2-5 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహించారు. మొత్తం 12 కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షలను నిర్వహించింది. మొత్తం 12,592 మంది ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.