హైదరాబాద్ : టీఎస్ పీఈసెట్-2022 నోటిఫికేషన్ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ విడుదల చేసింది. బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీఎస్ పీఈసెట్)ను నిర్వహించనున్నారు.
అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, మిగతా కేటగిరీల విద్యార్థులకు రూ. 800గా ఫీజు నిర్ణయించారు. ఇతర వివరాల కోసం www.pecet.tsche.ac.in అనే వెబ్సైట్ను సంప్రదించొచ్చు.