B.Tech | హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ) :ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకోవాలన్న మీ కల నెరవేరలేదా? ఉద్యోగం, కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యారా? ఏదో ఓ కంపెనీలో చేరి ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీరు ఉద్యోగం చేసుకొంటూనే.. బీటెక్ చేయొచ్చు. అటు ఉద్యోగాన్ని, ఇటు బీటెక్ చదువును రెండింటిని ఒకేసారి పూర్తిచేయవచ్చు. పరిశ్రమల్లో పనిచేసే వృత్తినిపుణులు బీటెక్లో చేరే అవకాశం కల్పిస్తూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకొన్నది.
ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఒక్కో బ్రాంచిలో 30 సీట్లుంటాయి. ఇది పార్ట్టైమ్ కోర్సు కాదు.. రెగ్యులర్ మోడ్లోనే నిర్వహిస్తారు. ఈ కోర్సుల నిర్వహణకు విద్యాసంస్థల నుంచి తాజాగా ఏఐసీటీఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఏఐసీటీఈ అనుమతించిన కాలేజీలు, కోర్సుల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ బీటెక్ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. నిరంతర విద్యను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఏఐసీటీఈ వర్గాలు వెల్లడించాయి. ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్లో భాగంగా సంస్థలు, పరిశ్రమల్లో పనిచేస్తూనే బీటెక్ కోర్సుల్లో చేరి, పట్టాను పుచ్చుకోవచ్చు.
నిబంధనలిలా..